హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) విద్యాశాఖ డైరెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడిగా ఆర్ సంతోష్ నియమితులయ్యారు. మంగళవారం డైరెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చిలగారి సంపత్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శిగా టీ నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా రవిబాబు, కవిత, సైదానాయక్, జియావుద్దీన్, ఆదిత్య, బాలగోపాల ప్రసాద్, సమీర్, సాయికుమార్, రంజన, గౌస్, ఆదిశేషుకుమార్, ఇమ్రోజ్, వేణుగోపాల్, దీప్తి సక్సేనాను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర సంఘం మహిళా విభా గం అధ్యక్షురాలు నిర్మల, ప్రతి నిధులు గడ్డం బాలస్వామి, యాకుబ్పాషా, అంజనీ కుమారి, కొంకటి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.