సంస్థాన్నారాయణపురం ; చావనైనా చస్తా.. కానీ లంచమైతే ఇవ్వనని ఓ రైతు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురంలో శనివారం చోటుచేసుకున్నది. కాయకష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టి నాలుగేండ్ల క్రితం కొనుగోలు చేసిన 250 గజాల ప్లాటు.. ప్రైవేట్ పట్టానా? లేక సీలింగ్ భూమినా? సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని కోరితే యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం తహసీల్దార్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడంటూ వావిళ్ల గ్రామానికి చెందిన రైతు బంటు సైదులు ఆందోళనకు దిగాడు.