హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు (Sankranti) మొదలయ్యాయి. మూడ్రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి (Bhogi) వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణమనే తేడాలేకుండా వేకువజామున లేచి భోగి మంటలు వేసి.. వాటి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. హైదరాబాద్లోని పలు కాలనీల్లో సంక్రాంతి సందడి నెలకొన్నది. ఆడపడుచులు రంగురంగులతో సంక్రాంతి ముగ్గులు వేసి వాటిని గొబ్బెమ్మలు, భోగి పండ్లతో అలంకరిస్తున్నారు.
ఇక ఎన్నికల ముంగిట పండుగ రావడంతో ఆంధ్రప్రదేశ్లో జోరు పీక్లో ఉన్నది. రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. సత్తుపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన ఆయన.. తనదైన స్టెప్పులతో ప్రజలను అలరించారు. అనంతరం మాట్లాడుతూ తాను సంక్రాంతి సంబరాల రాంబాబునేని అన్నారు. గత నాలుగేండ్లుగా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నామని వెల్లడించారు. రామంచంద్రాపురం నియోజకర్గంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ కుటుంబ సమేతంగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. పండుగలు తెలుగు వారి సంప్రదాయాల సంరక్షిస్తున్నాయని చెప్పారు. సంక్రాంతి, భోగి అంటే మనసులో ఉన్న మలినాలను కడిగేలాంటిదని తెలిపారు.
మంత్రి రోజా.. నగరిలోని తన నివాసం వద్ద భోగి సంబరాల్లో పాల్గొన్నారు. భర్త సెల్వమణితో కలిసి భోగి మంటలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. నాన్ లోకల్ నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇక్కడకు వచ్చి ఏదో చెబితే ప్రజలు నమ్మరని అన్నారు. భోగి, ఎన్నికలు ముగియగానే మళ్లీ హైదరాబాద్కు వెళ్లారని విమర్శించారు. తమ పార్టీని భోగిమంటల్లో తగుల పెడతామని టీడీపీ నేతలు అంటున్నారు. 2019లోనే ప్రజలు ఆ పార్టీ తగలపెట్టారని, వచ్చే ఎన్నికల్లోనూ అదే చేస్తారన్నారు.
భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు! pic.twitter.com/Tmtt5TDLMP
— Ambati Rambabu (@AmbatiRambabu) January 14, 2024