ఈనెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఢిల్లీ నగరంలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ చదరంగం పోటీలు (2021-22) జరగనున్నాయి. ఈ పోటీలకు మన రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్ర చదరంగ జట్టు పాల్గొననుంది. ఈ జట్టులో సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి పట్టణానికి చెందిన గుంటి సత్యనారాయణ ఎంపికయ్యారు. తమ జిల్లా వాసి ఈ పోటీలకు ఎంపిక కావడం పట్ల చెస్ అసోసియేషన్ వారు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతిరెడ్డిపల్లిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న గుంటి సత్యనారాయణ గతంలో (2017-18) రాంచీలో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ చదరంగ పోటీలలో తెలంగాణ రాష్ట్ర చదరంగ జట్టుకు కెప్టెన్గా వ్యవహించారు. 2018 ఫిబ్రవరిలో ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో జరిగిన జాతీయ స్థాయి చెస్ పోటీలలో కూడా రాష్ట్రం జట్టు తరఫున పాల్గొన్నారు.
అంతేకాకుండా జిల్లా చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా గత 25 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ పోటీలలో పాల్గొని గట్టిపోటీనిచ్చి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర చెస్ అసోసియేషన్ కార్యవర్గం, స్పోర్ట్స్ అసోసియేషన్ వారు, అధికారులు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆకాంక్షించారు.