సంగారెడ్డి: నార్కొటిక్ అధికారులు, సంగారెడ్డి పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి అల్ప్రాజోలమ్ తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని కులబ్గుర్లో అల్ప్రాజోలమ్ తయారు చేస్తున్నట్లుగా సమాచారం అందుకున్న నార్కొటిక్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి రైడ్ చేశారు.
ఈ సోదాల్లో కమల్, డేవిడ్, శివ, వినోద్ అనే నలుగురు నిందితులు పట్టుబడ్డారు. వారి దగ్గరి నుంచి అల్ప్రాజోలమ్ తయారీకి వాడే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముడిపదార్థాల విలువ రూ.50 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నలుగురు 2018లోను అల్ప్రాజోలమ్ అమ్ముతూ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.