హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రజలను చైతన్యపర్చే వేదికగా సోషల్ మీడియా నిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి సమావేశం తకళ్లపల్లి శ్రీనివాస్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు, రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని నిర్వహిస్తూ సమాజాన్ని, యువతను పకదారి పట్టిస్తున్నారని అన్నారు. అలాంటి వారి కుట్రల పట్ల ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యతను సోషల్ మీడియా సభ్యులు స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిషారదిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి సోషల్ మీడియా ప్రాముఖ్యతను వివరించారు. సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్, ఎన్ బాలమల్లేష్, ఈటీ నరసింహ, జిల్లా కార్యదర్శులు, సోషల్ మీడియా బాధ్యులు పాల్గొన్నారు.