నారాయణపేటరూరల్, ఆగస్టు 20: నారాయణపేట మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గొల్లకురుమలకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెలను విక్రయిస్తుండగా.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. గ్రామానికి చెందిన 13 మంది లబ్ధిదారుల వద్ద ఏపీలోని మాచర్లకు చెందిన నాగరాజు గొర్రెలను కొనుగోలు చేసి తరలిస్తున్న క్రమంలో నారాయణపేట మండలం కోటకొండ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకొని స్టేషన్కు తరలించారు.
రూరల్ ఎస్సై జయప్రసాద్, వెటర్నరీ వెద్యుడు అనిరుద్ఆచార్యతో కలిసి గ్రామంలో విచారణ చేపట్టారు. లబ్ధిదారులకు శుక్రవారం పంపిణీ చేసిన గొర్రెలను పరిశీలించగా, అవి ప్రభుత్వం అందించిన గొర్రెలుగా నిర్ధారించారు. వెటర్నరీ వైద్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై జయప్రసాద్ కేసు నమోదు చేశారు. గొర్రెలను కొనుగోలు చేసిన నాగరాజు, గొర్రెలు విక్రయించిన 13 మంది లబ్ధిదారులు, డీసీఎం డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.