హైదరాబాద్, ఫిబ్రవరి 29(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 6,271 మంది ధూప దీప నైవేద్యం(డీడీఎన్) అర్చకులకు ఫిబ్రవరి, మార్చి నెల గౌరవ వేతనాలు చెల్లించేందుకు రూ.11,01,96,000 నిధులను విడుదల చే సింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 బడ్జెట్ నుంచి ఈ నిధుల ను విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నది.