శ్రీశైలం : ఉభయ తెలుగు రాష్ర్టాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీశైల భ్రమరాంబదేవి (Srisaila Bramarambika Devi) అమ్మవారికి సాంప్రదాయబద్దంగా సారె సమర్పించినట్లు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్పారు. గురువారం తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్ అనుబంధమైన శైవక్షేత్ర వనితాశక్తి తెలంగాణ రాష్ట్ర విభాగ్ సభ్యులు (Saiva Kshetra vanitha shakti telangana vibhag ) వాసవి నిత్యాన్న సత్రం నుండి ఊరేగింపుగా ప్రధాన ఆలయం చేరుకుని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు.
మన అమ్మకు మనసారె.. మనసారా అంటూ 18 శక్తిపీఠాల్లో అమ్మవార్లకు సారె సమర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. తొలుతగా శ్రీశైల భ్రామరి అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభించినట్లు వనితాశక్తి కోర్కమిటి అధ్యక్షురాలు మంజుల చెప్పారు. ఈ కార్యక్రమంలో హైమ, స్రవంతి, నళినికుమారి,లత, మంజులరాజు, విశ్వజ్యోతి, పద్మజ, కళ్యాణిపద్మ, సబితతోపాటు సుమారు 60 మంది మహిళా సభ్యులు పాల్గొన్నారు.