హైదరాబాద్ : దేశంలోని సైనిక్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు (AISSEE 2024 Results) విడుదలయ్యాయి. ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాల కోసం జనవరి 28న దేశవ్యాప్తంగా 185 నగరాల్లోని 450 సెంటర్లలో AISSEE 2024 ప్రవేశపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ఈ పరీక్ష కీ విడుదల చేసిన ఎన్టీఏ అధికారులు గురువారం ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేసి స్కోర్ కార్డు పొందొచ్చు.
కాగా, సీట్ల భర్తీకి ఆన్లైన్ ద్వారానే కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. అంతకుముందు ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు https://pesa.ncog.gov.in/sainikschoolecounselling/landingpage లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్కు దరఖాస్తుల అనంతరం సీట్లు కేటాయింపు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే admission.sss@gov.inకు ఈ మెయిల్ చేయవచ్చని అధికారులు సూచించారు.