హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది సైనిక్ స్కూళ్లలో 6, 9 తరగతుల ప్రవేశాలకు బుధవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 21న నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఇదివరకు 33 సైనిక్ స్కూళ్లు ఉండగా, కొత్తగా 19 స్కూళ్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది. దీంతో మొత్తం 52 స్కూళ్లలో ప్రవేశాలు చేపడుతారు. రాష్ట్రంలో కరీంనగర్, హైదరాబాద్లో పరీక్ష నిర్వహిస్తారు.