యాదగిరిగుట్ట రూరల్, జనవరి 18: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర న్యాయమూర్తిగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం గ్రామానికి చెందిన సాయిని రాజ్కుమార్ నియమితులయ్యారు. ఇమ్మిగ్రేషన్ న్యాయవాదిగా పనిచేస్తున్న ఈయన గతంలో అక్కడి ప్రభుత్వానికి లీగల్ అడ్వయిజర్గా పనిచేశారు. తాజాగా అక్కడి గవర్నర్ ద్వారా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఆస్ట్రేలియాలో న్యాయమూర్తిగా నియమితులు కావడంతో తాళ్లగూడెం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.