నందికొండ/శ్రీశైలం/అయిజ/మదనాపురం, సెప్టెంబర్ 6: కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్కు మంగళవారం 1,18,539 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. దీంతో ఎన్నెస్పీ అధికారులు ప్రాజెక్టు ఎనిమిది క్రస్ట్ గేట్లను ఎత్తి 64,048 క్యూసెక్కులను దిగువకు వదిలారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 589.10 (309.3558 టీఎంసీలు) అడుగుల వద్ద ఉన్నది. శ్రీశైలం జలాశయానికి వరద నిలకడగా కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 1,38,874 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,18,663 క్యూసెక్కులుగా నమోదైనట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో డ్యాం రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో 58,969 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 38,056 క్యూసెక్కులుగా నమోదైంది.