హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి నుంచి ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు శంషాబాద్లోని జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనేక సౌకర్యాలను కల్పించారు. కాంటాక్ట్లెస్, పేపర్లెస్ విధానాల అమలుతోపాటు మాస్క్లు ధరించనివారికి, భౌతికదూరం పాటించనివారికి జరిమానా విధిస్తున్నారు. కౌంట ర్ల వద్ద రద్దీ నివారించేందుకు సెల్ఫ్ చెక్-ఇన్, సెల్ఫ్ బ్యాగ్-ట్యాగ్ను ప్రోత్సహిస్తున్నారు. చెక్-ఇన్ హాల్స్లో కాంటాక్ట్ లెస్ బోర్డింగ్ కోసం సెల్ఫ్ చెక్-ఇన్ కియోస్క్లను ఏర్పాటుచేశారు. చెక్-లెస్ టెక్నాలజీ కలిగిన ఈ క్యూఆర్ కోడ్ ఫ్రెండ్లీ కియోస్క్లు చెక్-ఇన్ ప్రక్రియను పూర్తిచేయడంలో సహాయపడతాయి. ఇవి బోర్డింగ్ కార్డ్, బ్యాగేజ్ ట్యాగ్లను ప్రింట్చేసి ఇస్తాయి. విమానాశ్రయంలోని అన్ని ఎలివేటర్లను టచ్-లెస్ ఎలివేటర్లుగా మార్చారు. అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ నివేదిక తప్పనిసరి కావడంతో విమానాశ్రయంలో ఐసీఎంఆర్, ఎన్ఏబీఎల్ ధ్రువీకరించిన ల్యాబ్ను 24 గంటలూ అందుబాటులో ఉంచారు. ఈ ల్యాబ్ నివేదికను కేవలం భౌతికరూపం (ఫిజికల్ కాపీ)లోనే కాకుండా ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు.