అమ్రాబాద్, సెప్టెంబర్ 30: నాగర్కర్నూల్ జిల్లా నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (ఏటీఆర్)లో సఫారీ యాత్ర ఆదివారం నుంచి పునఃప్రారంభిస్తున్నారు. జంతువుల సంతతి కోసం మూడు నెలల పాటు సఫారీ యాత్రను అటవీశాఖ నిలిపివేశారు. ఆదివారం నుంచి మళ్లీ యాత్ర ప్రారంభంకానున్నట్టు మన్ననూర్ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఈశ్వర్ తెలిపారు.
ఏటీఆర్లో ఫరహాబాద్ ద్వారం నుంచి జంగల్ సఫారీ ప్రారంభమై.. నల్లమల అడవుల్లోని వృక్ష, జంతుజాలం గురించి పర్యాటకులకు వివరిస్తూ ముందుకు సాగనున్నదని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు యాత్ర ఉంటుందని, మన్ననూర్ అటవీ శాఖ కార్యాలయంలో లేదా ఆన్లైన్ ద్వారా యాత్రను బుక్ చేసుకోవచ్చని సూచించారు.