హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఎన్నికల క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీని ఎదురోలేక ప్రతిపక్ష పార్టీలు హత్యారాజకీయాలకు పాల్పడుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇలాంటి చర్యలు హేయమని తెలిపారు.
ఓటమి భయంతోనే రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, అశాంతిని రేకెత్తించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాజకీయంగా ఎదురొనలేక భౌతిక దాడులకు దిగడం సరికాదని హితవుపలికారు. ఇలా దాడులు చేసే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.