హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ కలెక్టర్గా ఆర్వీ కర్ణన్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్ కే శశాంకను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మహబూబాబాద్ ప్రస్తుత కలెక్టర్ వీపీ గౌతమ్ను ఖమ్మం జిల్లా కలెక్టర్గా నియమించారు. మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్కు జిల్లా తాత్కాలిక కలెక్టర్ (ఎఫ్ఏసీ)గా బాధ్యతలు అప్పగించారు.