హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యలో భాషాపండిత వ్యవస్థను రద్దుచేయాలని ఆర్యూపీపీ -తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో సంఘం నేతలు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఎఫ్ఎల్ఎన్, ఉన్నతి కార్యక్రమాలను రద్దుచేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, కోశాధికారి వీఎస్ఎస్శర్మ, విజయభాస్కర్, హమీద్ఖాన్, ఇస్మాయిల్, రోహిత్కుమార్, దినకర్, ఎఫ్ఎస్ అలీ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.