చండూరు, అక్టోబర్ 25: రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులంతా అండగా ఉన్నారని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ సభ్యులతో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, వేతన సవరణ అమలు కోసం చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. యూనియన్ నాయకులు కమలాకర్గౌడ్, అంజయ్య, లింగస్వామి పాల్గొన్నారు.