హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిషారం కావని, పోరాడి సాధించుకోవాలని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రజాసేవలో కీలకపాత్ర పోషిసున్నప్పటికీ.. వారికి తగిన భద్రత, వేతనాలు అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి దుర్ఘటనలు మరిన్ని చోటుచేసుకునే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిషరించాలని కోరారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ మృతి బాధాకరమని, వారి కుటుంబానికి ఎమ్మెల్సీ సత్యం ప్రగాఢ సానుభూతి తెలిపారు.