హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడంలో, యాజమాన్యంతో చర్చలు జరుపడంలో కార్మికశాఖ విఫలమైందని, ఇందుకు నిరసనగా ఈ నెల 10న కార్మికశాఖ ఎదుట ఆర్టీసీ కార్మికులు గర్జన నిర్వహించనున్నట్టు జేఏసీ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు జేఏసీ చైర్మన్ వెంకన్న ఆధ్వర్యంలో ఈయూ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక పక ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ యాజమాన్యానికి తాకట్టు పెడుతూ, మరోపక రీ ఆర్గనేజషన్ యాక్ట్-2014కు తూట్లు పొడుస్తూ బస్ భవన్లో సగభాగాన్ని ప్రభుత్వం ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్ జోన్ కార్మికులను కరీంనగర్, హైదరాబాద్ జోన్లకు బదిలీలు చేసే ప్రక్రియ చేపడుతూనే.. మరోపక మల్టీ ట్రేడ్ సిస్టమ్ని తీసుకొచ్చి ఆర్టీసీ కార్మికులను అణగదొకే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిషారం కోసం సహకరించాలని సోమవారం మరో లేఖను జాయింట్ లేబర్ కమిషనర్ సునీతాగోపాల్దాస్కు అందజేశారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే 10 లేబర్ కమిషన్ ఎదుట కార్మిక గర్జన నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ వైస్ చైర్మన్ థామస్రెడ్డి, కన్వీనర్ మౌలానా, కో కన్వీనర్లు యాదయ్య, సురేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.