హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ బస్లు నడిరోడ్డుపై కాలిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తం గా ఇప్పటికే మూడు ఎలక్ట్రిక్ బస్సు లు దగ్ధమయ్యాయి. డ్రైవర్ల అప్రమత్తతతో మూడుచోట్ల ప్రాణాపాయం తప్పింది. కాలిపోయిన బస్సులు మూడూ జేబీఎం సంస్థవి కావడంతో ఆర్టీసీ మేల్కొన్నది. ఎందుకు దగ్ధమవుతున్నాయో తెలుసుకొనేంతవర కూ వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గురువారం ప్రకటించింది.
నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం కింద ఆర్టీసీలో నడుస్తున్న జేబీఎం ఈ-బస్సుల్లో వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యం లో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న దాదాపు 500 బస్లు షెడ్డుకు వెళ్లనున్నాయి. ఫిట్నెస్ వస్తేనే పునరుద్ధరణపై నిర్ణయం తీసుకొంటామని యాజమాన్యం తెలిపింది.