TSRTC | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ టీఎస్ఆర్టీసీ నడపనున్న ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు, కొత్త రూట్ల కోసం సంస్థ ఓ ఆన్ సర్వేను నిర్వహించనున్నది. ప్రయాణికులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, వివిధ ప్రైవేట్ సంస్థల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించనున్నది. ఈ సర్వేలో ప్రయాణికుల పేరు, జెండర్, ఉద్యోగం చేస్తున్న సంస్థలు, వారు వెళ్లే ప్రదేశాల పేర్లతో వివరాలు సేకరించనున్నారు. వారు ఇప్పుడు గమ్యస్థానాలకు చేరుకోవడానికి వినయోగిస్తున్న రవాణా గురించిన వివరాలను పొందుపర్చారు. మీరు ఇంటి నుంచి ఎన్నింటికి కార్యాలయాలకు వెళ్తారు? అక్కడి నుంచి ఎన్నింటికి తిరిగి వస్తారు? రవాణాలో, రక్షణ విషయంలో మీకు ఎదురయ్యే ఇబ్బందులు, ఎక్కడా ఆగకుండా ఉండేలా ప్రీమియం సర్వీసులను కోరుకుంటున్నారా? తదితర విషయాలను సర్వే ఫారంలో పొందుపర్చారు.
ప్రజాభిప్రాయం మేరకు ప్రజారవాణా
సర్వేలో పొందుపర్చిన అంశాలపై ప్రజలు తమకు కావాల్సిన వాటిని పూర్తి చేయాలి. అత్యధిక మంది ప్రజల అభిప్రాయాల ప్రకారం కొత్త రూట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు అవసరం లేదనకుంటే ఆయా మార్గాల్లో బస్సు సర్వీసులను తగ్గించాలనే అభిప్రాయాలు తెలుపవచ్చు. దీనివల్ల ప్రయాణికులకు సౌకర్యాలు, ఆర్టీసీకి సరైన చోటుకు బస్సులను నడిపే వెసులుబాటు కలుగుతుంది.
సర్వే జరిగే ప్రాంతాలు
హైదరాబాద్ వెస్ట్ : మాదాపూర్, గచ్చిబౌలి, నానక్ లింగంపల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల
హైదరాబాద్ నార్త్: కొంపల్లి, అల్వాల్, తిరుమలగిరి, సుచిత్ర, విక్రంపురి
హైదరాబాద్ నార్త్ వెస్ట్: బాలానగర్, కూకట్ మియాపూర్, కేపీహెచ్ చందానగర్
హైదరాబాద్ నార్త్ ఈస్ట్: సఫిల్ ఈసీఐఎల్, రాంపల్లి, మలాజ్ మల్లాపూర్
హైదరాబాద్ సౌత్: కాటేదాన్, శంషాబాద్, ఓల్డ్ తుకుగూడ
హైదరాబాద్ సౌత్ ఈస్ట్: దిల్ ఎల్బీనగర్ వనస్థలిపురం, హయత్
హైదరాబాద్ ఈస్ట్: ఉప్పల్, ఘట్ హబ్సిగూడ, నాగోల్, రామంతాపూర్
హైదరాబాద్ సెంట్రల్: హిమాయత్ ముషీరాబాద్, బేగంపేట్, ఖైరతాబాద్, మెహదీపట్నం, బంజారాహిల్స్, మలక్ నల్లకుంట, అంబర్