హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రయాణికులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నెట్వర్ను అప్గ్రేడ్ చేయాలని సంస్థ చైర్మన్ గోవర్ధన్, ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. ఒరాకిల్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) అమలుకు నల్సాఫ్ట్ కంపెనీతో ఆర్టీసీ ఒప్పం దం కుదుర్చుకొన్నది.సోమవారం బస్భవన్లో ఒప్పంద పత్రాలపై సజ్జనార్, నల్సాఫ్ట్ సీఈవో సీఏ వెంకట నల్లూరి సంతకాలు చేశారు. దేశంలోనే ఈ ఒప్పందం మొదటిది కావడం విశేషం.
అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం ద్వారా సంస్థ అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకే ఒరాకిల్ ఈఆర్పీ ప్రాజెక్ట్ను అమలు చేస్తున్నట్టు ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. రాష్ట్రంలోని డిపోలు, జోన్లతోపాటు హెడ్ఆఫీస్లోని ఫైనాన్స్, హెచ్ఆర్, ఇంజినీరింగ్ తదితర విభాగాలను ఈఆర్పీ ఏకీకృతం చేస్తుందని, నల్సాఫ్ట్ ఇంప్లిమెంటేషన్ ఇందుకు పార్టనర్గా వ్యవహరించనున్నదని పేర్కొన్నారు. సమర్థవంతమైన ఈ వ్యవస్థ ఆర్టీసీ అభివృద్ధికి దోహదం చేస్తుందని వెల్లడించారు. ఇది సమిష్టి కృషి అని, అంకితభావంతో పనిచేసి నిర్దేశించుకొన్న కాలానికి దీన్ని పూర్తి చేయగలమనే విశ్వా సం తమకు ఉందని నల్సాఫ్ట్ సీఈవో సీఏ వెంకట నల్లూరి తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్కుమార్, చీఫ్ మేనేజర్ (ఎఫ్అండ్ఏ) విజయ పుష్ప, సీవో(ఐటీ) రాజశేఖర్, నల్సాఫ్ట్ ప్రతినిధులు అనిరుధ్, అఖిల్, వికాస్, హరిప్రసన్న, శివరామకృష్ణ పాల్గొన్నారు.