కరీంనగర్ తెలంగాణచౌక్, ఏప్రిల్ 23: కరీంనగర్ డిపో -2లో ఈవీ బ స్సులను నడిపిస్తున్న ‘జై మారుతి భారత్’ సంస్థలో డ్రైవర్ల ఏజెన్సీ అయిన శ్రీచక్ర తమ డ్రైవర్లకు గురువారం హె చ్చరిక జారీ చేసింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగుల చేపట్టిన సమ్మెకు మద్దతుగా పాల్గొనవద్దని డ్రైవర్లకు మెసేజ్ పంపించింది. మద్దతుగా పాల్గొంటే జీతాలు చెల్లించేది లేదని స్ప ష్టం చేసింది.
ఈవీ బస్సులను సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకుంటే వీడియో లు తీయాలని సూచించింది. తోటి కా ర్మికులు సమ్మెలో పాల్గొంటే తమకు ఇలాంటి మెసేజ్ పంపండంపై డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేపు తమకు సమస్య వస్తే అండగా ఉండేవా రు ఎవరని ఆవేదనకు గురవుతున్నారు.