వరంగల్ : ఆర్టీసీ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనగా వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా ( Driver Suicide Attempt) యత్నానికి పాల్పడడం తీవ్ర సంచలనం కలిగించింది.
నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ( Strike ) లో దిగిన ఆర్టీసీ కార్మికులు రెండోరోజు అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా గురువారం నర్సంపేట డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
సహచర కార్మికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేసి తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ నాయకులు , మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్ సహ పలువురు బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు.