నిజామాబాద్: జిల్లాలోని డిచ్పల్లిలో పెను ప్రమాదం తప్పింది. డిచ్పల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ డీలక్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులోని ప్రయాణికులను వెళికితీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి బోధన్కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.