తొర్రూరు, మార్చి 12: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఓ ఆర్టీసీ కండక్టర్ బస్సులోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆదివారం జరిగింది. ఎస్సై జీ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన మహేందర్రెడ్డి(55) కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం విధుల నిమిత్తం తొర్రూరు ఆర్టీసీ బస్సు డిపోకు వెళ్లాడు. రిజిస్టర్లో సంతకం చేసి డిపోలో ఉన్న ఏపీ 29జెడ్ 0354 బస్సులో తన వెంట తెచ్చుకున్న టవాల్తో కడ్డీకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీశ్ తెలిపారు.