హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందారని, వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం సంతోషకర విషయమని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సంస్థలో పనిచేస్తున్న వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.
సంస్థకు సీఎం కేసీఆర్ అందించిన సహాయ సహకారాలు సంస్థ పురోగతికి ఎంతో దోహదపడిందని చెప్పారు. తాను సంస్థ చైర్మన్గా ప్రభుత్వానికి వారధిగా పనిచేశానని, తన హయాంలో ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్కు, బిల్లును ఆమోదించిన గవర్నర్కు సంస్థ, ఉద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విలీనానికి సహకరించిన మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, పువ్వాడ, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు చెప్పారు.