హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరిస్తూ ట్రాఫిక్రూల్స్ పాటించకపోయినా, రోడ్లమధ్యలో బస్సలు నిలిపినా డ్రైవర్లపై చర్యలు తప్పవని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్లను డ్రైవర్లే సొంతంగా చెల్లించాలని సూచించారు. డ్రైవర్కు కమ్యూనిటీ అవగాహన కల్పించేందుకు డిపోలలో నోటీస్ బోర్డులు, అవుట్గోయింగ్ కంట్రోల్ చార్ట్, ఆయిల్బంక్లు మొదలైన ప్రదేశాల్లో సూచనలను రాతపూర్వకంగా ప్రదర్శించాలని ఉన్నతాధికారులకు సూచించారు. డ్రైవర్లు నిర్లక్ష్యంగా రోడ్డు మధ్యలో బస్సులు నిలపడం ద్వారా ఇతర వాహనదారులకు అసౌకర్యంతోపాటు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, దీనివల్ల సంస్థకు కూడా చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని డివిజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు తగినచర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.