కామారెడ్డి రూరల్, ఆగస్టు 13 : డివైడర్ను ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులోని 19 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకొన్నది. బాన్సువాడ డిపోకు చెందిన బస్సు శనివారం మధ్యా హ్నం నిజామాబాద్ నుంచి కామారెడ్డికి బయలుదేరింది. కామారెడ్డి సమీపంలోని పాత కలెక్టరేట్ వద్దకు రాగానే బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. సమీప గోదాముల్లోని కూలీలు గమనించి అక్కడికి చేరుకొన్నా రు. బస్సు వెనుక అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటికి తీశారు. మొత్తం 29 మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ ఉం డగా.. 19మంది గాయపడ్డారు. వెంటనే వీరి ని కామారెడ్డి దవాఖానకు తరలించారు.