(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లక్ష్యంగా ఆరెస్సెస్ పావులు కదుపుతున్నదా? దక్షిణాదిలో పాగా వేసేందుకు తెలంగాణ సహా తమిళనాడు, కేరళపైనా ఫోకస్ పెట్టిందా? వచ్చే నెల 9 నుంచి రాయ్పూర్లో 3 రోజుల పాటు జరుగనున్న సమావేశాల్లో ఇవే ప్రధాన అంశాలా? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి.
ఆయా రాష్ర్టాల్లో హిందూత్వ వ్యూహాన్ని ఎలా అమలు చేయాలన్న దిశగా చర్చలు జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. అంతేకాకుండా.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన్ గడ్కరీని తొలగింపు, మోదీ-షా టార్గెట్గా ఆయన చేసిన వ్యాఖ్యలపై అనధికారికంగా చర్చించనున్నట్టు తెలిసింది.