RS Praveen Kumar | కొల్లాపూర్, ఏప్రిల్ 21: బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని జాఫర్ మైదానంలో ఆదివారం మార్నింగ్వాక్లో భాగంగా క్రీడాకారులు, సీనియర్ సిటిజన్స్తో మాట్లాడారు. అలాగే కూరగాయల మార్కెట్లో చిరువ్యాపారులను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్లో ట్రాన్స్పోర్టు లారీ వద్దకు వెళ్లి హమాలీల కష్టాలు తెలుసుకోవడంతోపాటు బస్తాలు మోసి ఓట్లను అభ్యర్థించారు.
బస్టాండ్లో ఉద్యోగులు, ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. పట్టణంలోని పలుచౌరస్తాల్లో ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జి అభిలాశ్రావు, నాయకులు నరేందర్రెడ్డి, జంబులయ్య, శ్రీనువాసులు తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో గుణపాఠం చెప్పాలి