హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రిజర్వ్బ్యాంక్ (ఆర్బీఐ) అనుమతితో బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.4 వేల కోట్లు చేరాయి. 13 ఏండ్ల కాలపరిమితికి 8.02 శాతం వడ్డీతో తెలంగాణ ప్రభుత్వం ఈ రుణాలను సమీకరించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రుణం తీసుకోవడం ఇదే మొదటిసారి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రుణ సమీకరణను అడ్డుకోవడంతో తెలంగాణ రాష్ట్రం గత ఏప్రిల్, మే నెలల్లో కలిపి సుమారు రూ.8 వేల కోట్ల రుణాలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ నెల 3న తెలంగాణ సహా నాలుగు రాష్ర్టాలకు బాండ్ల విక్రయానికి అనుమతి ఇచ్చింది.