జనగామ : సీఎం కేసీఆర్ను బుధవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి తపాస్ పల్లి రిజర్వాయర్ కు పైపు లైన్ ద్వారా నీరందించేందుకు రూ.388 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రగతి భవన్ లో కలిసి జనగామ నియోజకవర్గం రైతుల పక్షాన పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ..నాడు బియ్యం కడిగిన నీళ్లను పారబోయకుండ తిరిగి ఆ నీటిని వాడుకునే పరిస్థితి ఉన్న బచ్చన్నపేట, చేర్యాల లాంటి ప్రాంతాల్లో ఉండేది. కానీ, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన మల్లన్నసాగర్ నుంచి తపాస్ పల్లి రిజర్వాయర్ వరకు భారీ పైప్ లైన్ నిర్మాణం పూర్తయితే మొత్తం జనగామ నియోజవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు.
దశాబ్దల కరువును దూరం చేసి రాబోయే తరాలకు తరాలకు శాశ్వతంగా బతుకుదెరువునిస్తున్న కేసీఆర్కు రైతుల పక్షాన శతకోటి వందనాలు తెలిపారు.