హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నష్టాల్లో ఉన్నవాటితోపాటు లాభాల్లో ఉన్న సంస్థలను కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు తెగనమ్ముతుంటే, రాష్ట్రంలో పేదల బతుకు చక్రం ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్రప్రభుత్వం నిత్యం తపిస్తున్నది. ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినా నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి ఆపన్నహస్తం అందిస్తూనే ఉన్నది. వేల కార్మిక కుటుంబాలు, కోట్లమంది సామాన్య ప్రయాణికుల జీవితాలతో ముడిపడిన అంశం కావడంతో సీఎం కేసీఆర్ ఆర్టీసీ విషయంలో మానవతా దృక్పథంతోనే ముందుకెళ్తున్నారు. టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఇదీ.