హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య రంగానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది ప్రభుత్వం రూ.12,161కోట్లు కేటాయించింది. ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెడ్లో రూ.11,500 కోట్లు ప్రతిపాదించింది. అంటే సుమారు.. రూ.651 కోట్లు కోత పడింది. నాలుగు నెలల కాలానికి రూ.3,690 కోట్లు కేటాయించింది.
వాస్తవానికి ఈ ఏడాది వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్ చుట్టూ నాలుగు టిమ్స్ దవాఖానలు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉన్నది. దీనికితోడు ప్రభు త్వం ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య రంగానికి ఈ దఫా సుమారు రూ.13 వేల కోట్లకుపైగా కేటాయిస్తారని భావించగా.. నిరుడికన్నా కోత విధించడం గమనార్హం.