RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు( Oscar Award ) దక్కడం పట్ల భారతదేశం( India ) హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన అవార్డుతో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా తెలుగు సినిమా( Telugu Cinema ) ఘనత విశ్వవ్యాప్తమైందని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. కానీ గతంలో ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించే థియేటర్లు కాల పెడతాం.. తగలబెడతాం.. దర్శకుడు రాజమౌళి( Director Rajamouli )ని ఉద్దేశించి బిడ్డ నువ్వు కనుక సినిమా రిలీజ్ చేస్తే ఉరికిచ్చి కొడతాం అని ఈ సినిమా మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్( Bandi Sanjay ).. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కడంతో సినిమా యూనిట్, దర్శకుడిని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టడం నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
ఈ సందర్భంగా నెటిజన్లు గతంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వీడియోలను షేర్ చేస్తూ.. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి బండి సంజయ్ అంటూ విమర్శించారు. బండి సంజయ్ చేసిన ట్వీట్ను కొందరు రీట్వీట్ చేస్తూ బండి సంజయ్కు సిగ్గులేదంటూ తూర్పారా పట్టారు. ఇప్పటికైనా ఇలాంటి బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. మొత్తం మీద సినిమాకు అవార్డు రావడం ఎంత ట్రెండింగ్గా మారిందో, బండి సంజయ్ వైఖరిని నిరసిస్తూ నెటిజన్లు స్పందించిన తీరు కూడా అంతే ట్రెండింగ్గా మారింది.
నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడం పట్ల భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది. కానీ గతంలో తీవ్రంగా వ్యతిరేకించే థియేటర్లు కాల పెడతాం.. తగలబెడతాం.. రాజమౌళిని సినిమా రిలీజ్ చేస్తే ఉరికిచ్చి కొడతాం అని అన్న అదే బండి ఇప్పుడు ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టడం నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
RRR సినిమా నాటు నాటు పాటకు ఆస్కార్.. గతంలో #RRR సినిమాను తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్..బిడ్డ నువ్వు కనుక సినిమా రిలీజ్ చేస్తే ఉరికిచ్చి కొడతాం. థియేటర్లు కాల పెడతాం.. తగలబెడతాం.. అని దర్శకుడు రాజమౌళి గారిని ఉద్దేశించి మాట్లాడిన బండి కామెంట్స్ వీడియో pic.twitter.com/f5mHucp3hp
— Namasthe Telangana (@ntdailyonline) March 13, 2023