హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దానిస్థానంలో స్వతంత్ర, పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలకే ప్రవేశ పరీక్షల నిర్వహణ హకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టీ నాగరాజు, పుట్ట లక్ష్మణ్, ఎస్ అనిల్, పొడపంగి నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ దేశంలో విద్యను పూర్తిగా కార్పొరేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం నెట్టివేస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.