సిద్దిపేట, జూలై 11: ఇంజినీరింగ్ సీటు ఇప్పించి కెరీర్లో నిలదొక్కుకునేలా సహకరించినందుకు రోహిత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి.. బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్, వనిత దంపతుల కుమారుడు రోహిత్కు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ కళాశాలలో గతంలో హరీశ్రావు కంప్యూటర్ సైన్స్ సీటు ఇప్పించారు.
ప్రస్తుతం రోహిత్ రూ.12 లక్షల వార్షిక వేతనంతో అమెరికా బహుళ జాతి సంస్థలో ఉద్యోగం సాధించాడు. హరీశ్రావు తనకెంతో సాయం చేశారని గుర్తుచేసుకున్న రోహిత్.. శనివారం సిద్దిపేటలో ఆయన్ను కలిసి తన చదువుకు సాయం చేసిన విషయాన్ని గుర్తుచేశాడు. తన వార్షిక వేతనంలో సగం రూ.6 లక్షలు సమాజ సేవా కార్యక్రమాలకు వినియోగించాలని హరీశ్రావుకు అందజేశారు. ఈ సందర్భంగా రోహిత్ను హరీశ్రావు అభినందించారు.