Road Accident | మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మమహ్మద్నగర్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కే ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. వివరాల్లోకి వెళితే.. జీడిమెట్లకు చెందిన దంపతులు ఏడుపాయల దర్శనానికి వెళ్లి తిరుగు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆటో లారీని ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటనలో నలుగురికి తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తూప్రాన్ డీఎస్పీ యాదగిరి తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ, నర్సాపూర్ సీఐ లాల్ మదర్, ఎస్ఐ శివప్రసాద్రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. విషయం తెలుసుకున్నా మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ మురళి యాదవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే, మృతులకు సంబంధించిన సమాచారం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.