హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద డీసీఎం-ద్విచక్రవాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతులు చౌటుప్పల్ మండలం లక్కారం వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంతో కొద్ది సేపు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం, మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.