అచ్చంపేట నియోజకవర్గం లోని బల్మూర్ మండలం రామాజిపల్లి గేట్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అచ్చంపేట కు చెందిన సంపు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఫిరోజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఫిరోజ్ ను 108 వాహనంలో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.