హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ (ఎస్సీ) గురుకులాల్లో ఇంటర్ ఫస్టియర్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష (ఆర్జేసీ సెట్-2022) ఫలితాలను ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం విడుదల చేశారు. మొత్తం 19,360 సీట్లకు ఫిబ్రవరి 20న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రితోపాటు సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ అభినందనలు తెలిపారు. మెరిట్ విద్యార్థులు ఈ నెల 11 నుంచి 21 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కులం, ఆదాయం, బదిలీ, స్టడీ సర్టిఫికెట్లతో విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని సొసైటీ ప్రధాన కార్యదర్శి శక్రునాయక్ తెలిపారు. వివరాలకు www.tswreis. ac.in లేదా www.tsw rjc.cgg.gov.in వెబ్సైట్లను చూడాలి.