హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమారకు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎంకు వారు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల వెహికల్, మెడికల్, జీపీఎఫ్తో, సప్లిమెంటరీ శాలరీ బిల్లులతోపాటు విలీన వీఆర్ఏల వేతనాల బిల్లులు మంజూరు చేయాలని కోరా రు. కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలు/డివిజన్ల ఉద్యోగులకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, వీరి సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించేందుకు రెవె న్యూ సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలిపారు. కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షుడు వం గ రవీందర్రెడ్డి, కార్యదర్శి గౌతమ్కుమార్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, నిరంజన్, రమణ్రెడ్డి తదితరులు ఉన్నారు.