హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఇంకా అక్కడక్కడా మిగిలివున్న భూ సమస్యల పరిషారానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు.
మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేసి, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ సదస్సులు నిర్వహించాలని సీఎం తెలిపారు. దీనిపై అవగాహన సదస్సు ఈ నెల 11న ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. ఈ అవగాహన సదస్సుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు.