హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో వేర్వేరుగా సమావేశమయ్యా రు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, పార్టీలో చేరికలు, రాష్ట్రంలో వంద రోజుల పాలన తదితర అంశాలపై వారితో చర్చించినట్టు సమాచారం. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చి న హామీలు, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు తీసుకున్న చర్యలను వివరించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించా యి.
ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్, నల్లగొండ, జహీరాబాద్, మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉం ది. వీటికి గతంలో ప్రతిపాదించిన పేర్ల స్థానంలో తాజాగా జరిగిన చేరికల కారణంగా కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాల్సిన అవశ్యకతపై సీఎం పార్టీ పెద్దలతో చర్చించినట్టు తెలిసింది.
చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరిన విషయాన్ని వారికి వివరించడంతోపాటు త్వ రలో మరికొందరు పార్టీలో చేరనున్నారని చెప్పినట్టు తెలిసింది. చేవెళ్ల నుంచి రంజిత్రెడ్డిని బరిలోకి దించి, గతంలో ప్రతిపాదించిన సునీతా మ హేందర్రెడ్డిని మల్కాజిగిరి నుంచి పోటీ చేయించాలని ప్రతిపాదించినట్టు చెప్తున్నారు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ను బరిలోకి దించపడమా? లేక ఆయనకు మం త్రి పదవి ఇవ్వడమా? అనే అంశంపై చ ర్చించనున్నారని సమాచారం.
ఎంపీ అ భ్యర్థుల ఖరారుకు ఢిల్లీలో సోమవారం జరగాల్సిన కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం మంగళవారానికి వా యిదా పడటం, సీడబ్ల్యూసీ సమావేశం కూడా అదే రోజు ఉండటంతో సీఎం రే వంత్రెడ్డి అక్కడే ఉంటారని తెలిసింది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 11వ సారి.