హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్శాఖకు రూ.29,271 కోట్లు ప్రతిపాదించింది. వీటిల్లో ప్రధానంగా ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు, స్వయం సహాయక సం ఘాల వడ్డీ లేని రుణాలకు రూ.3 వేల కోట్లు కేటాయించింది. జిల్లా పరిషత్ రూ.252 కోట్లు, మండల పరిషత్లకు రూ.248 కోట్లు ప్రతిపాదించింది. ఇప్పటివరకు వీటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. వీటిని మౌలిక సదుపాయాలకు ఖర్చుచేయనున్నారు. నిర్వహణ పద్దు కింద రూ.6,898 కోట్లను కేటాయించింది. రోడ్లు, వంతెన లకు రూ.300 కోట్లు, నీటి నిర్వహణ, శానిటేషన్కు రూ.2,366 కోట్లు, గ్రామపంచాయతీలకు రూ.1,736 కోట్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్యోజన (పీఎంజీఎస్వై)కు రూ.541 కోట్లు, గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణానికి రూ.150 కోట్లు, మిషన్ భగీరథకు రూ.1,366 కోట్లు కేటాయించింది. సెర్ప్లోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1,698 కోట్లు, ఉపాధి హామీ పనులకు రూ.1,471కోట్లు ప్రతిపాదించింది.