Meenakshi Natarajan | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల్లో గెలువలేకనే బీజేపీ కుట్ర చేసి మీనాక్షీనటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. తెలంగాణలో మీనాక్షీనటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పారు. ఓట్చోరీ, ఎస్ఐఆర్ తర్వాత, ఇప్పుడు బీజేపీ సీట్చోరీకి పాల్పడుతున్నదని ఆరోపించారు. నామినేషన్ను కుట్రపూరితంగా తిరస్కరించడం ప్రజాస్వామ్యానికి చీకటిరోజు అని, దీనిని పౌరులందరూ ఖండించాలని కోరారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు.