KTR | దళారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. వానాకాలం వరికోతలు సాగుతున్నాయని.. నేటి వరకు రైతుబంధు వేయలేదని.. రూ.15వేల రైతుభరోసా ఊసెత్తడం లేదన్నారు. కనీసం పండించిన చేసిన పంటను కొనుగోలు కూడా చేయడం లేదని.. ఫలితంగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయ్యిందని పేర్కొన్నారు. ఈ సీజన్లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారని.. అక్టోబర్లో నెలలో 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు.
అక్టోబర్ 28 నాటికి వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని.. దాన్ని బట్టి రైతన్న అంటే ఎంత నిర్లక్ష్యమో ప్రజలు చూడాలన్నారు. దళారులతో కుమ్మక్కు అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని.. నేటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగనేలేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో తెలియక.. ప్రారంభించిన ఐకేపీ కేంద్రాల్లోను కొనుగోలు ప్రక్రియ నిలిచిందన్నారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్టి నాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్తో బిజీబిజీగా ఉన్నాడంటూ సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ దళారి ప్రభుత్వం రైతులను నిండా ముంచింది.
వానాకాలం వరికోతలు సాగుతున్నయ్.
కానీ నేటి వరకు రైతుబంధు వేయలేదు.
రూ.15 వేల రైతు భరోసా ఊసే లేదు.కనీసం హార్వెస్ట్ చేసిన పంటను కొనుగోలు కూడా చేయడం లేదు. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకు చాలా చోట్ల… pic.twitter.com/jPMGqSCHO5
— KTR (@KTRBRS) November 1, 2024